మదనపల్లె: బీజేపీ యువ మోర్చా తిరుపతి జిల్లా ఇంచార్జ్గా నూతన బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ను అన్నమయ్య జిల్లా బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ అప్పగించిన నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
యువతను మరింత చైతన్యవంతం చేస్తూ, ప్రజా సమస్యలపై అవగాహన కల్పించి, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నాయకులు కోరారు.
యువత భాగస్వామ్యంతో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా బీజేపీ యువ మోర్చా నాయకులు సింహం శ్రీకాంత్, భాను, రమేష్, నాగరాజు, మూడే పిల్ల స్వామి నాయక్, రెడ్డి శేఖర్, రవి తేజ, నవీన్, బాలాజీ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.










