ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సూపరింటెండెంట్ గేదెల శశిభూషణరావు చేతుల మీదుగా పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఫోటోగ్రాఫర్లకు రాయితీ రుణాలు ఇవ్వాలని, జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించాలని అసోసియేషన్ నాయకులు రవిశంకర్, రాజన్, శేఖర్ కోరారు. వారికి సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.










