సాలూరు పట్టణంలోని బొడ్డవలసలో ఇంటింటికీ ‘మన్యం పోలీస్’ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం రాత్రి పట్టణ సీఐ అప్పలనాయుడు ప్రజలను నేరుగా కలిసి సైబర్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. వాట్సాప్లలో వచ్చే లింక్లు ఓపెన్ చేయరాదని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించాలని కోరారు.










