మంత్రి నారా లోకేశ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు విజయనగరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగే హెన్ఆర్డీ క్లస్టర్ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు విజయనగరం నియోజకవర్గం చెల్లూరు గ్రామంలో పార్టీ క్యాడర్తో సమావేశం కానున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.










