గాజులరేగ కొండపై జరిగిన పోలీసు వాహన ప్రమాదంలో కానిస్టేబుల్ రమణ మృతి చెందారు. విజయనగరం రూరల్ PSలో విధులు నిర్వహిస్తున్న రమణ.. కొండకరకాం కేసు దర్యాప్తు నిమిత్తం ఎస్ఐ అశోక్తో పాటు సిబ్బందితో వెళ్లి తిరిగి వస్తుండగా వాహనం బోల్తాపడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమణను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా, పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగింది.









