మాజీ ఆర్మీ ఉద్యోగి అదృశ్యం..|

0
11

● ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాని 86 ఏళ్ల వృద్ధుడు

● స్వల్ప జ్ఞాపకశక్తి సమస్య, మధుమేహంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యుల సమాచారం

● ఆచూకీ కోసం ఓల్డ్ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు.

ఆల్వాల్, ఆగస్టు 25: ఓల్డ్ అల్వాల్‌లో 86 ఏళ్ల మాజీ ఆర్మీ ఉద్యోగి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. కరుణానగర్, జొన్నబండ, ఓల్డ్ అల్వాల్‌కు చెందిన దేవీద్ ప్రసాద్ (86) ఆగస్టు 21న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆయన భార్య చేది సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం.. ఆగస్టు 21న సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో దేవీద్ ప్రసాద్, ఆయన కుమారుడు ఇంట్లో ఉండగా దేవీద్ ప్రసాద్ బయటకు వెళ్లారు. అనంతరం ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయితే ఆయన ఆచూకీ లభించలేదు.

దేవీద్ ప్రసాద్ స్వల్ప జ్ఞాపకశక్తి సమస్యతో పాటు మధుమేహంతో బాధపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనను గుర్తించి ఆచూకీ తెలియజేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

#Sidhumaroju

Alwal