తనను కేఏ పాల్తో పోల్చడంతో బొత్స సత్యనారాయణపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు.బొత్స ఎన్ని పార్టీలు మారారో, YSR, విజయమ్మలను ఎలా దూషించారో ప్రజలు గమనించాలన్నారు. బొత్స సత్యనారాయణది ఎంత దారుణమైన చరిత్రో గుర్తు చేసుకోవాలన్నారు. తాను, కేఏ పాల్ మంచి వాళ్లం కాదు అనేది అతని ఉద్దేశమా అని ప్రశ్నించారు. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన ఆయన.. దానికి తను CM అభ్యర్థిని కానని స్పష్టం చేశారు.










