ఉదయగిరి ఆనకట్టపై ఉన్న రక్షణ గోడలు పగుళ్లకు గురై తీవ్రంగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఆనకట్ట నిర్మించి చాలా కాలం కావడంతో గోడలు బలహీనపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజూ పలువురు ఈ గోడలపై కూర్చుని ముచ్చటిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
గోడల దుస్థితి కారణంగా ప్రమాదాలు జరగడమే కాకుండా, చారిత్రక ఆనకట్ట వైభవం కూడా కనుమరుగవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు తక్షణమే స్పందించి ఆనకట్ట గోడలకు పునర్నిర్మాణం లేదా మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.










