ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర మేయర్ *శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్* గారు పాల్గొన్నారు. మేయర్ గారితో పాటు డిసిసి జిల్లా అధ్యక్షులు శ్రీ నాగేష్ రెడ్డి గారు, సిటీ అధ్యక్షులు శ్రీ బొబ్బిలి రామకృష్ణ గారు, కార్పొరేటర్ శ్రీ మనోహర్ గారు తదితర నాయకులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా గణేశుని ఆగమనాన్ని స్వాగతిస్తూ ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించారు. యువకులు, స్థానిక ప్రజలు ఆనందోత్సాహాలతో పాల్గొని కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. మేయర్ గారు మరియు ఇతర నాయకులు గణేశునికి పూజలు చేసి, భక్తులకు ఆశీర్వాదాలు అందించారు.
కసాబ్ గల్లీ యూత్ వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు అందరూ అభినందనలు తెలిపారు. నగరంలో గణేశ్ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయని, ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు










