విద్యార్థులకు న్యాయ చట్టాలు, మాదకద్రవ్యాలపై అవగాహన|

0
13

ఆసిఫాబాద్  (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు చిన్నతనం నుంచే న్యాయ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే సమాజంలో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పిలుపునిచ్చింది. గురువారం ఆసిఫాబాద్‌లోని జడ్పీహెచ్‌ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినులకు న్యాయ అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అనసూయ గారి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో విద్యార్థులకు నిత్య జీవితంలో ఉపయోగపడే పలు కీలక చట్టాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దు ఈ సందర్భంగా న్యాయమూర్తులు, అధికారులు మాట్లాడుతూ. నేటి యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు, ముఖ్యంగా మాదకద్రవ్యాలకు (Drugs) బానిసలు కాకూడదని హితవు పలికారు. చదువుకునే వయసులో లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు.కీలక చట్టాలపై చైతన్యం సమాజంలో బాలికలు, మహిళల రక్షణ కోసం ఉన్న వివిధ చట్టాలను ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా బాల కార్మిక నిషేధ చట్టంబాల్య వివాహాల నియంత్రణ చట్టంమొదలైన అంశాలపై విద్యార్థినులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలను, చిన్న వయసులోనే పిల్లలను పనుల్లో పెట్టడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.ఈ అవగాహన కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ అంజనీ దేవి, పాఠశాల ప్రిన్సిపల్ జనార్దన్, ఉపాధ్యాయ బృందం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.