విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 89వ వార్డు అప్పల నరసింహ కాలనీలో ఏర చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు పరిశీలించారు.
ఈ సందర్భంగా చెరువు వద్ద చేపడుతున్న పనుల పురోగతిని అధికారులను, సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు ఉపయోగకరంగా అభివృద్ధి చేయాలని సూచించారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని శ్రీ గణబాబు గారు తెలిపారు.










