జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియన్ క్రీడలకు (Aichi-Nagoya Asian Games 2026) ఇంటర్నేషనల్ టెక్నికల్ ఆఫీషియల్ (ITO) గా ఎంపికై జపాన్ వెళ్తున్న శ్రీ *D.V.S.Y. శర్మ* గారిని అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, ప్రభుత్వ విప్ *గణబాబు* గారు అభినందించారు.
కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లోనూ ప్రతిభ చాటిన ఆయన, అంతర్జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ క్రీడా రంగానికి మరియు దేశానికి సేవలందిస్తూ ముందుకు సాగాలని గణబాబు గారు ఆకాంక్షించారు








