● లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద ఏర్పాట్ల పరిశీలన
● ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జనం నిర్వహించేందుకు సూచనలు
అల్వాల్, సెప్టెంబర్ 15: రాబోయే గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను కుత్బుల్లాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం, కుత్బుల్లాపూర్ డివిజన్ ఏసీపీ బాల గంగిరెడ్డి పరిశీలించారు.
నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన సౌకర్యాలను వారు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సజావుగా, సురక్షితంగా నిర్వహించేలా సంబంధిత పోలీసు సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
#Sidhumaroju
Alwal










