AU ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో 19న సీఎం పర్యటన |

0
1

విశాఖపట్నం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ నెల 19న ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో జరగనున్న గౌరవ ముఖ్యమంత్రి పర్యటన, SASA మరియు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహణలో ప్రభుత్వ విప్ *గణబాబు* పాల్గొన్నారు.

ఈ సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీ భరత్ వర్చువల్ విధానంలో హాజరుకాగా.. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు ప్రత్యక్షంగా పాల్గొని, సభా ప్రాంగణంలో లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు, తాగునీరు, ట్రాఫిక్ మరియు బందోబస్తు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులతో చర్చించారు.