సూర్యమోహన్ దౌల్తాబాద్ రిపోర్టర్
యాంకి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
వడ్డే బుజ్జప్పను గొంతు కోసి హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు
కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం యాంకి గ్రామంలో ఘోరం జరిగింది.వడ్డే బుజ్జప్ప (55) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి చంపినట్లు సమాచారం.సమాచారం అందుకున్న వెంటనే కొడంగల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి,దౌల్తాబాద్ ఎస్సై వేణుకుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.హత్యకు దారితీసిన పరిస్థితులపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.ఈ హత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదు.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.హత్యకు గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










