పాలకుల నిర్లక్ష్యంతో వివేకానంద నగర్‌లో డ్రైనేజీ సమస్య.

0
1

పుంగనూరులో మినీ బైపాస్ రోడ్డులోని వివేకానంద నగర్‌లో డ్రైనేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరడంతో దుర్వాసనతో పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నగర వాసులు కోరుతున్నారు.