మోదీకి సహస్రనామంతో శుభాకాంక్షలు.|

0
3

● నవ కుంకుమలతో సహస్రనామార్చనలో ఈటల రాజేందర్

● ప్రధాని ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు

● దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు

అల్వాల్, సెప్టెంబర్ 19: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన నవ కుంకుమలతో సహస్రనామార్చన కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. 

దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రార్థించారు.

వేద మంత్రోచ్ఛారణలు, లలితా సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

కార్యక్రమంలో సామ రంగారెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, నవజీవన్ రెడ్డి, కొత్త రవీందర్ రెడ్డి, కిరణ్ రెడ్డి, ఢిల్లీ వెంకటేష్‌తో పాటు ఆధ్యాత్మిక ప్రముఖులు, నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal