పుంగనూరు నియోజకవర్గం బోయకొండ యానాదిపాలెంలో బుధవారం దారుణ ఘటన జరిగింది. తమ్ముడు నాగరాజు వేటకొడవలితో దాడి చేయడంతో అక్క గంగులమ్మ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి, ఒక వేలు తెగిపోయింది. బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పుంగనూరు కోర్టులో హాజరుపరిచారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.
