సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఎంపీడీవో రవికుమార్ ఆదేశించారు. బొబ్బిలి (M) జగన్నాపురం సచివాలయాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. సచివాలయ ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో తిరుగుతున్న స్వచ్ఛ రథాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
#BOIENA RAJESH










