మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ వారుచేపట్టిన మంచిర్యాల శుభ్రత -ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 వ డివిజన్ నందు చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ డివిజన్ లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగింది.
మేయర్ స్పెషల్ డ్రైవ్ లో జరిగే పనులను పరిశీలించి స్థానిక ప్రజల తో మాట్లాడి పనుల పురోగతి గురించి తెలుసుకోవడం జరిగింది.అధికారులు సిబ్బంది స్థానిక ప్రజలతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారం కొరకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు స్థానిక 50 వ డివిజన్ కార్పొరేటర్ పెట్టం స్వరూప లక్ష్మణ్ , కో ఆప్షన్ సభ్యులు బెంజిమెన్ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి గారు, ఆత్మ చైర్మెన్ మురళి గారు,50 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గట్టు స్వామి ,కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సిరిపురం రాజేష్ ,కాంగ్రెస్ నాయకులు బొడ్డు శంకర్, అశ్వక్,ప్రకాష్,మురళీధర్,sk ఖలీద్ రౌఫ్, శ్రీనివాస్,రాజేష్,డివిజన్ అధికారి, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.










