పండగలో అల్లర్లు, గొడవలు చేస్తే కఠిన చర్యలు

0
4

పండగలో గొడవలు, అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి పట్టణంలోని రావువారివీధిలో ఆదివారం సమావేశం నిర్వహించారు. దాడితల్లి గ్రామదేవత పండుగలో అల్లర్లు, గొడవలు చేయకుండా ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. సిరిమానోత్సవం విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. అల్లర్లు, గొడవలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు పాల్గొన్నారు.

#Boiena Rajesh