*న్యూస్ ( భారత్ ఆవాజ్ ).
*రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి విద్యార్థులకు నిరీక్షణ ముగిసింది. పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని నాంపల్లిలోని ఎస్ఎస్సీ బోర్డు (SSC Board) కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు.ఈ ఏడాది రాష్ట్రంలో 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు వివిధ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఫలితాల విడుదలైన వెంటనే విద్యార్థులు bse.telangana.gov.in, results.cgg.gov.in, manabadi.co.in వెబ్సైట్ ద్వారా తమ మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు.*









