హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మృతి

0
5

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మృతి చెందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

‎ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

‎సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ గారి సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు.

‎బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన కేటీఆర్, వారికి ధైర్యం చెబుతూ తాము అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

‎ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే కేటీఆర్ తన కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని తన పీఏ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.

‎అలాగే శంషాబాద్ ఏసీపీ నాగభూషణం గారితో స్వయంగా మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

‎బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంలో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

‎మృతుల దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించే ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని తన బృందాన్ని కేటీఆర్ ఆదేశించారు.

‎తమ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు ఇలా రోడ్డు ప్రమాదాల్లో పోవడం తనను ఎంతగానో కలిచివేసిందని పేర్కొంటూ.. మృతుల కుటుంబాలకు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో తోడుంటామని కేటీఆర్ గారు భరోసా కల్పించారు.