భద్రాచలం:
భద్రాచలం అటవీ శాఖలో భారీ అవినీతి తిమింగలాలు ఏసీబీ వలలో చిక్కాయి. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఘటన వివరాలు:
రోడ్డు పనుల సందర్భంలో చెట్లు దెబ్బతిన్న కేసులో ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు భద్రాచలం అటవీ శాఖకు చెందిన ఎఫ్డీఓ (FDO) సుజాత, చర్ల ఇన్ఛార్జ్ డీఆర్వో (DRO) కృష్ణయ్య రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ:
డిమాండ్ చేసిన మొత్తంలో భాగంగా రూ. 3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా, ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఇద్దరు అధికారులను నగదుతో సహా పట్టుకున్నారు.
లకావత్ కిరణ్










