నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మ వారి తిరణాల పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఒంగోలు జాతి పశు ప్రదర్శన బండలాగుడు పోటీలు రసవత్రంగా కొనసాగుతున్నాయి, బుధవారం రాత్రి సీనియర్ విభాగంలో సీనియర్ ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర ప్రారంభించారు, 8 జతల పాల్గొన్నఒంగోలు జాతి ఎడ్ల కు సీనియర్ విభాగంలో ఒకటన్ను 900 కేజీల బరువుతో బండలాగుడి పోటీలు నిర్వహించారు, ఎడ్ల యజమానులకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నూతన వస్త్రాలు జ్ఞాపికలు అందజేశారు.
సీనియర్ విభాగంలో బండలాగుడు పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగాయి న్యూ క్యాటగిరి విభాగంలో 8 జతలు పాల్గొనగా 20 నిమిషాలకు సమయం కేజీల బరువు బండలాగుడు పోటీలు మంగళవారం అర్ధరాత్రి వరకుజరిగాయి, పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఇల్లపాడు గ్రామానికి చెందిన మంగు రమాదేవి ఎడ్ల జత 4050 అడుగుల దూరంలాగి మొదటి స్థానంలోనూ, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండబాల వారి పాలెం గ్రామానికి చెందిన గూడవల్లి లక్ష్మీ దీక్షిత్ చౌదరి, పోతిన లక్ష్మి త్చౌదరి కంబైన్ ఎట్ల జత 4006 అడుగుల దూరం లాగే రెండో స్థానంలో నిచ్చాయి, పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటల గ్రామానికి చెందిన పెన్న బోయిన సతీష్ కుమార్ యాదవ్.
రేపల్లె మండలం రేపల్లి గ్రామానికి చెందిన సుఖవాసి సతీష్ బాబు కంబైన్ ఎట్ల జత 3947 దూరం లాగే మూడో స్థానంలో ను, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకోదాడ మండలం రామలక్ష్మి పురం గ్రామానికి చెందిన కొప్పుల హేమంత రెడ్డి శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత 3750 దూరం లాగే నాలుగో స్థానంలో నిలిచాయి, ఆలయ వంశపార్యం పర్య ధర్మకర్త చిరుమామిళ్ల వెంకట లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు వడ్లమూడి పెద్ద శీను ఉమ్మనేని విక్రం, అత్తులూరి వెంకట్రావు, దిగుమర్తి రాంబాబు, గంటా శివాజీ, చిరువామిళ్ళ రాంబాబు లు దాతల సహకారంతో ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు 50 వేలు, 45 వేలు, 40 వేలు, 35 వేలు నగదును అందజేశారు, ఈ ఎడ్ల బండలాగుడు పోటీల ఎస్ రాధాకృష్ణ శ్రీనివాసరావులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.










