ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉపాధి పనులు చేయాలని ఎంపీడీఓ పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం చింతాడ జంగాలబందలో జరుగుతున్న ఉపాధి పనులను శనివారం పరిశీలించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు పూటలా పనులు చేయాలన్నారు. పనులు జరిగే ప్రాంతాల్లో తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలన్నారు. కనీస వేతనాలు వచ్చేలా పనులు చేయాలని సూచించారు.
#Boiena Rajesh









