పుంగనూరు మండలం కుక్కలపల్లిలో ఎంబీఏ విద్యార్థి గంగరాజు (24) తన స్నేహితుడి ఇంట్లో మిద్దెపై మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతన్ని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.










