Kavitha పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “తెలంగాణ అమ్మ”గా చెప్పుకునే ఆమె, పోక్సో కేసులో మైనర్ బాలికకు జరిగిన అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నది కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు కావడంతోనే మౌనం పాటిస్తున్నారా అని విమర్శలు వస్తున్నాయి.
గతంలో చిన్న విషయాలకైనా స్పందించిన కవిత, ఇప్పుడు బాధితురాలి విషయంలో స్పందించకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆడబిడ్డలకు అండగా ఉంటానన్న మాటలు కేవలం రాజకీయాల కోసమేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.









