పెద్దపల్లి : పాలకుర్తి మండలం పుట్నూరులో మంగళవారం రాత్రి బౌదు సుమలత (28) దారుణ హత్యకు గురైంది. స్థానికులకు ప్రకారం… జనాభా లెక్కల సమాచారం కోసం బుధవారం ఉదయం ఒక అధికారి ఇంటికి వెళ్లగా సుమలత మంచంలో రక్తపు మడుగులో పడి ఉంది.
దీంతో అధికార కేకలు వేయడంతో స్థానికులు గమనించి వెంటనే బసంత నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నూతి శ్రీధర్ ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాలి.









