పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, రాయవారిపల్లి పంచాయతీలో ఆదివారం ఒక ఏనుగు మామిడి చెట్లను ధ్వంసం చేసి, టన్నుల కొద్దీ మామిడికాయలను నేలరాల్చడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉప్పు చెరువుకు చెందిన త్యాగరాజ నాయుడు, కొత్త రామాపురానికి చెందిన విశ్వనాథ నాయుడు, రామచంద్ర నాయుడు ఈ సంఘటనను వివరించారు. ఏనుగు చింతలవంకలోకి వెళ్లిపోయినట్లు రైతులు తెలిపారు. తమ పొలాల వైపు వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి.










