పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో ఆదివారం మధ్యాహ్నం విచిత్ర వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి సూర్యుడు అంతగా కనిపించకపోయినా, ఉష్ణోగ్రతలు తగ్గలేదు.
మధ్యాహ్నం అనంతరం కొన్నిచోట్ల భారీ వర్షం, మరికొన్నిచోట్ల స్వల్ప వర్షం కురిసింది. ఇంకొన్ని చోట్ల ఒకవైపు వర్షం, మరోవైపు ఎండ కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇదేమి వింత అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు# కొత్తూరు మురళి.










