కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.

0
1

కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్

విమానాశ్రయంలో లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు

కార్యకర్తలు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారితో ఫోటోలు దిగిన మంత్రి

కడప నియోజకవర్గ టీడీపీ నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొన్న లోకేష్

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం ఆయన కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

 

విమానాశ్రయం వెలుపల తన కోసం ఎదురుచూస్తున్న ప్రతిఒక్కరినీ మంత్రి లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. కార్యకర్తలు, స్థానిక ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు, అభిమానులతో ఆయన ఫోటోలు దిగారు.

 

అనంతరం మంత్రి లోకేష్ కడప నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.