“డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం”.. గాంధీ వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన.|

0
18

సికింద్రాబాద్ : గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి చెందిన ఘటన కలకలం రేపింది.

జియాగూడకు చెందిన పల్లవి గౌడ్(19) ఛాతిలో పెరిగిన గడ్డకు ఈ నెల 19న గాంధీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే ఆపరేషన్ అనంతరం ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి ఆమె మృతి చెందినట్లు సమాచారం.

పల్లవి బీఎస్సీ నర్సింగ్ సెకండియర్ చదువుతున్నట్లు తెలిసింది.

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఘటనపై ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న వైద్యులు.. నివేదిక వచ్చిన తరువాతే అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

#Sidhumaroju