కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసిస్తూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ఇంధన ధరలు పెంచి సామాన్యులపై భారం మోపడం దుర్మార్గమని ఆమె విమర్శించారు. వెంటనే పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ తారీక్, ముఖ్య నాయకులు రాపర్తి మురళి, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










