బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని ఎంపీడీఓ రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం రాచేరువలసలో బుధవారం రోడ్డు పక్కనున్న చెత్తను తొలగించారు. ఖాళీ స్థలాలు, కాలువలు, రోడ్లపై చెత్త వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలను కోరారు. ఇంటింటికెళ్లి చెత్త సేకరణ జరిగేలా చూడాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది, గ్రామస్థులున్నారు.
#Boiena Rajesh










