కర్నూలు జిల్లాలోని జులై 1 నుండి 4 వరకు కర్నూలు నగరంలో జరగనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి.సి ఆర్ భవన్ నందు కరపత్రల ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో జూలై 1 నుండి 4 వరకు కర్నూల్ నగరంలో జరగనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని స్థానిక సిఆర్ భవనం నందు కరపత్రాన్ని ఆవిష్కరించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణ బాధ్యులు కామ్రేడ్ గిడ్డయ్య గారు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి. వలరాజు గారు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష జి వలరాజు వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యను చంపివేయడానికి నిదర్శనంగా
త్రిబుల్ పి విధానాన్ని తీసుకొని వచ్చి ప్రభుత్వ విద్యను కార్పొరేట్లకు స్వచ్ఛందంగా అమ్మి వేస్తున్నదని అన్నారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు మరియు విజినరీ చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ అమలు కాక విద్యార్థులు యువజనలను మోసం చేసి
అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాల అవుతున్న ఇప్పటికింకా అధికారంలోకి వంద రోజుల్లో 77 జీవోను రద్దు చేస్తానని ఇప్పటికీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అందించకుండా పత్రికా ప్రకటనలతో మభ్యపెడుతూ
1200 కోట్లు విడుదల చేశామని చెబుతూ ఇప్పటికింకా పూర్తిస్థాయిలో విడుదల చేయకుండా మోసం చేస్తున్న నయవంచన ప్రభుత్వం ఉందని అన్నారు పేద విద్యార్థులు డిగ్రీలు ఇంజనీర్లు డాక్టర్లు కావడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదని అందుకోసమే ప్రభుత్వ మెడికల్ కళాశాలను రక్షించాల్సిన కూటమి ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కార్
శాతం పూర్తయిన కళాశాలను కూడా కార్పొరేట్లకు అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నదని విద్యాశాఖ మంత్రి వైద్యశాఖ మంత్రి, దోబూచులాటాడుతూ పేద విద్యార్థుల మెడికల్ విద్యను అమ్మి వేస్తూ మరో పక్కన ప్రభుత్వ విద్యను పరిరక్షించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నామంటూ పత్రికా ప్రకటనలకు పరిమితమైతున్న కూటమి ప్రభుత్వంపై
జూన్ ఒకటో తారీకు నుండి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ Aisf పోరాటం సాగిస్తుందని అన్నారు,
NTA సంస్థ వారు పేపర్ లీకులకు పాల్పడితే ఒక్క మాట మాట్లాడని విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ
యూనివర్సిటీల హక్కులను కాలరాసే vbsa వికసితా భారత్ విజ్ఞాన్ పరిషత్ అంటూ 90 శాతం ఆయ రాష్ట్రాల విద్యార్థుల హక్కులను కాలరాస్తూ UGC లాంటి సంస్థలను కేంద్రీకరణ పేరుతో విజ్ఞానం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు కాబట్టి కేంద్రీకరణనువ్యతిరేకిస్తున్నామన్నారు,మరోపక్క రాష్ట్రంలో ఇప్పటి ముప్పడిగా ఉన్నత విద్యారంగంలో సవరణలు చేస్తూ ప్రభుత్వ అనుయాయుల కళాశాలలకు లైసెన్సులు మంజూరు చేస్తూ తల్లిదండ్రుల దగ్గర నుండి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ కోట్ల వ్యాపారం గడిస్తున్న KL, SRM విజ్ఞాన్, గీతం ఇలాంటి యూనివర్సిటీలపై చర్యలు తీసుకోకుండా, కార్పొరేట్ల యాజమాన్యపు మంత్రిగా విద్యాశాఖ మంత్రి చలామనవుతున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్స్ పోస్టులు భర్తీ చేయకుండా హై స్కూల్ టీచర్లను ఇంటర్మీడియట్ విద్య బోధించమని చెప్పడం ద్వారానే ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాలు పూర్తిస్థాయిలో విఫలం అయ్యాయని అన్నారు. స్కూల్ విద్యను బోధించే ఉపాధ్యాయుల చేత ఇంటర్మీడియట్ విద్యను బోధించమంటే ఆ ఉపాధ్యాయులు ఎలా బోధించగలరు ప్రభుత్వ వైఫల్యం వలనే ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.అందువల్ల ప్రభుత్వ విద్యను పరిరక్షించే దిశగా జులై 1 నుండి 4 వరకు జరగనున్న విద్యా వైజ్ఞానిక రాజకీయ సైతాంతిక శిక్షణా తరగతుల్లో రాష్ట్ర నలుమూలల నుండి హాజరవుతున్న విద్యార్థులను చైతన్యపరచి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నదని ఈ శిక్షణా తరగతులకు యూనివర్సిటీల నుండి మేధావులు హాజరు కానున్నారని విద్యార్థులు అందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి డి.సోమన్న, యస్ షాబీర్ భాష,సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణ రెడ్డి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శిలు రంగస్వామి, శరత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్, శ్రీకాంత్, నగర కార్యదర్శి అశోక్,మహిళా నాయకురాలు మెస్సి, శ్రీకవ్య, నాయకులు మునీస్వామి, విరాంజి,తదితరులు పాల్గొన్నారు.










