ప్రచురణార్థం:- 29-05-2026
*మండవ కుటుంబరావు 3వ వర్ధంతి సందర్భంగా టీటీడీకి 15 టన్నుల కూరగాయల లారీ ప్రారంభం,సేవా కార్యక్రమాల ద్వారా మండవ కుటుంబరావు ఆశయాలను కొనసాగిస్తున్న కుటుంబ సభ్యులు అభినందనీయులు – MLA బొండా ఉమామహేశ్వరరావు గారు*
ధి:- 29-05-2026 ఈరోజు ఉదయం ఏలూరు రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ చుట్టుగుంట వద్ద కీర్తిశేషులు మండవ కుటుంబరావు గారి 3వ వర్ధంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి 15 టన్నుల కూరగాయల లారీని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బొండా ఉమ గారు మాట్లాడుతూ:- కీర్తిశేషులు మండవ కుటుంబరావు గారు జీవించి ఉన్న సమయంలో ప్రతి నెలా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి లారీల ద్వారా కూరగాయలు పంపిస్తూ విశిష్టమైన సేవ అందించేవారని గుర్తు చేశారు. ఆ సేవా కార్యక్రమాల్లో తాము కూడా ఎన్నోసార్లు పాల్గొన్నామని తెలిపారు.
ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన కుటుంబ సభ్యులు అదే సేవా స్ఫూర్తితో ఆయన పేరుమీద సేవా కార్యక్రమాలను కొనసాగించడం గొప్ప విషయమని కొనియాడారు. విజయవాడ నగరంలో మండవ కుటుంబరావు గారి సేవలను, వ్యక్తిత్వాన్ని తెలియని వారు ఉండరని, ఆయన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ సమాజ సేవకు అంకితభావంతో జీవించారని అన్నారు.
ఆయన లేని లోటును కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాల ద్వారా భర్తీ చేస్తూ ముందుకు సాగడం సంతోషకరమన్నారు. వర్ధంతి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ, మజ్జిగ పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులకు, అసోసియేషన్ ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.
అనంతరం కీర్తిశేషులు మండవ కుటుంబరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో :- మాజీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి, ఎం. నాగేందర్ (నాగు), గుమ్మడి సురేష్, బోయపాటి అరుణ్, నువ్వుల రాజేష్, మేదరమట్ల శ్రీనివాస్, నందగోపాల్ నాయుడు, నూతక్కి శివరామకృష్ణ, తుమ్మల భోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు…










