మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : చింతల్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద నిర్వహించిన తాపి మేస్త్రీల ఆత్మ గౌరవ సభ కి మద్దతు తెలిపిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి భరత్ సింహారెడ్డి.
ఈ సందర్బంగా మాట్లాడుతూ…భవన నిర్మాణం లో తాపీ మేస్త్రి పాత్ర చాలా కీలకం అని అలాగే 44 సంఘాల ట్రేడ్ యూనియన్ నాయకులు ఐకమత్యంగా ఉండి ఒక రేటు నిర్ణయించుకొని భవన యజమానికి తెలియచేసి, వారిని తృప్తి పరిచి మీరు కూడా తృప్తి చెందాలని కోరుతు సెంట్రింగ్ సమస్యల పైన కూడా కూర్చొని చర్చించు కోవడానికి నా వంతు సహాయం అందిస్తానని చెప్పారు,
అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదాము, జిల్లా అధ్యక్షులు మదు సుదన్ రెడ్డి, నియోజకవర్గం అధ్యక్షులు సంపత్ రెడ్డి మాట్లాడుతూ సెంట్రింగ్ కార్మికులు మా పైన చేసే ఆరోపణలు అవాస్తావమని మాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మనము కలిసి పని చేసుకునేవాళ్ళము.
వాళ్లని విడదీసే హక్కు మీకు ఎవరు ఇచ్చారని, మేస్త్రి మాత్రమే ముందు వచ్చారని మా తరువాతే సెంట్రింగ్ వ్యవస్థ వచ్చిందని మేస్త్రి ఎవరికీ అన్యాయం చేసేవాడు కాదని మేస్త్రి పని చేసిన తరువాతే సెంట్రింగ్ పని ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు,
ఇలాగే మీ వైఖరి ఇలాగే ఉంటే మేము కూడా లక్ష మంది కార్మికులతో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు,
ఈ కార్యక్రమం లో చింతల్ అధ్యక్షులు శ్రీనివాస్ మరియు భారీగా తాపి మేస్త్రీలు పాల్గొన్నారు.
#sidhumaroju










