South Coast Railway way Zone

0
3

దశాబ్దాల కలకు సాకారం.. నేటి నుంచి విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం..

రాష్ట్ర ప్రజల చిరకాల కల విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాకారం అయ్యింది. 2019 ఎన్నికలకు ముందే కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రకటన చేసినా, గత వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. భూములు అప్పగించాలని కేంద్రం ఎన్ని సార్లు కోరినా పట్టించుకోలేదు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఒక్కో విభజన హామీ పరిష్కారం అవుతుంది. రాజధాని చట్టబద్ధత, పోలవరం నిర్మాణం, విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజ్, రైల్వే జోన్ సహా అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి.