మదనపల్లె పట్టణంలో ఆడవేషాలు వేసుకుని అమాయకులను మోసం చేస్తున్న ముఠాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. గురువారం కొందరు బాధితులు మీడియా ముందుకు వచ్చి, ఓ యువకుడు అమ్మాయిలా నమ్మించి, ఇంట్లోని ప్రేతాత్మలను తరిమేస్తానని, కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి శాంతి పూజలు, తాంత్రిక, క్షుద్రపూజల పేరుతో భారీగా డబ్బు గుంజుకున్నారని తెలిపారు. తనలాగే చాలామంది మోసపోయారని, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని బాధితుడు పేర్కొన్నాడు










