మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలోని రామ్నగర్ ప్రాంతంలో బోర్వెల్ పనిచేయక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
స్థానిక నివాసితుల ఫిర్యాదు అందుకున్న వెంటనే ఆమె స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి, స్వచ్ఛంద సహకారంతో బోర్వెల్ను మరమ్మతు చేయించి తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చారు.
దీంతో కాలనీవాసులకు తాగునీటి సరఫరా పునరుద్ధరించబడింది.
ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రాంతంలో నెలకొన్న పలు మౌలిక వసతుల సమస్యలు, పౌర అవసరాలకు సంబంధించిన అంశాలను నివాసితులు ఆమె దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
బోర్వెల్ మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయించి తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు స్థానికులు శాంతి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె ఎప్పటికప్పుడు ముందుండి స్పందిస్తూ, కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రేమ్, అరుణ్, లింగారెడ్డి, మహేందర్, జార్జ్ తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










