రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి

0
0

దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

భారత్ అవాజ్ న్యూస్:జూన్ 13  రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. రేఖంపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ వేణు(38) ఉదయం విధులకు బైక్పై బయల్దేరారు. గిర్నిబావి సమీపంలోని లోకేశ్వరం మిల్లు వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వేణు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము