సికింద్రాబాద్ : సికింద్రాబాద్లోని దేవకి లాడ్జ్లో గోపాలపురం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జూన్ 14న ప్రత్యేక బృందం క్లూస్ టీమ్, స్వతంత్ర సాక్షులతో కలిసి దేవకి లాడ్జ్లో సోదాలు నిర్వహించింది.
ఈ సందర్భంగా బీహార్కు చెందిన రిషి కుమార్ (23)తో పాటు 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకుని వారి సామాను తనిఖీ చేయగా, 13 ప్యాకెట్లలో ఉన్న 17 కిలోల గంజాయి లభ్యమైంది.
విచారణలో నిందితులు ఒడిశాలోని సంబల్పూర్ నుంచి మహారాష్ట్రలోని పూణేకు హైదరాబాద్ మీదుగా గంజాయిని తరలిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంలో ప్రధాన సరఫరాదారుగా భావిస్తున్న బీహార్కు చెందిన విజయ్ అలియాస్ సంభవ్ కుమార్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
గంజాయితో పాటు నిందితులు ఉపయోగిస్తున్న రెండు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.
మల్కాజిగిరి జోన్ డీసీపీ C. శ్రీధర్ , ఏసీపీ యాదగిరి రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ఆపరేషన్లో పాల్గొన్న గోపాలపురం పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.
#Sidhumaroju










