బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, పుంగనూరు పరిధిలోని ఆర్ సి వై ఎస్టేట్, భీమ గాని పల్లి బైపాస్ లోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ వద్ద నిరుద్యోగ యువత కోసం గురువారం భారీ జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ మేళాలో 120 పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి, దీని ద్వారా 22,000 మందికి పైగా అర్హులైన యువత ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు రూ. 10,000 నుండి రూ. 1,00,000 వరకు వేతనాలు అందించబడతాయి. ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు# కొత్తూరు మురళి.










