మదనపల్లి: సచివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.|

0
1

మదనపల్లి పట్టణంలోని సొసైటీ కాలనీ పార్క్ సమీపంలో ఉన్న సచివాలయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా SIR కార్యక్రమంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించే విధంగా కార్యాచరణ ప్రణాళికను త్వరగా సిద్ధం చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు ఎలాంటి సందేహాలు లేకుండా సేవలు పొందేందుకు సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.