అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం 🌾|

0
0

అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం 🌾

ముండ్లమూరు మండలం శంకరాపురంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమంలో రైతులతో కలిసి ఎడ్లబండిపై పాల్గొన్న దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.

రైతులకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే ₹5,000 అన్నదాత సుఖీభవ, ₹2,000 పీఎం కిసాన్ కలిపి మొత్తం ₹7,000 రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

దర్శి నియోజకవర్గంలోని 42,871 మంది రైతులకు ₹28.49 కోట్ల ఆర్థిక సాయం అందిందన్నారు. రైతు సంక్షేమం, గిట్టుబాటు ధరలు, సకాలంలో ఎరువుల సరఫరా, పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.