కార్మికులకు కనీస వేతనాలు పెంచలేని ప్రభుత్వానికి విజయోత్సవాలు నిర్వహించే హక్కు లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు విమర్శించారు. ఆదివారం మదనపల్లెలో మాట్లాడుతూ, 2006-07 తర్వాత రాష్ట్రంలో కనీస వేతనాల పెంపు జరగలేదని, కార్మికులకు నెలకు కనీసం రూ. 26 వేల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు చేపడతామని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు










