ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు మార్కాపురం నియోజకవర్గంలో వివిధ శుభకార్యాలలో పాల్గొన్నారు.
పెద్ద దోర్నాల్లో జరిగిన ఆడుసుమిల్లి వారి వివాహ మహోత్సవం సందర్భంగా విచ్చేసి పెండ్లి కుమారునికి శుభాకాంక్షలు తెలియజేశారు.
తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు గ్రామానికి చెందిన మోడీ వారి పుష్పాలంకరణ మహోత్సవానికి విచ్చేసి పాపను ఆశీర్వదించారు. ఈ శుభకార్యానికి కందుల రోహిత్ రెడ్డి గారు విచ్చేసి పాపను ఆశీర్వదించారు.
కొనకనమిట్ల మండలంలోని బసాపురం గ్రామానికి చెందిన అంకాలవారి వివాహ మహోత్సవం సందర్భంగా విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.










