అమరావతి, సచివాలయం
(22-06-2026).
*సచివాలయంలో ప్రజా దర్బార్.. అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి*
*ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం.. సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ*
👉 సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను మంత్రి స్వయంగా కలుసుకుని వారి సమస్యలు, వినతులు, అర్జీలను స్వీకరించారు.
👉 ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.










