సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ మినహా నిందితులందరూ న్యాయస్థానానికి హాజరయ్యారు. వర్చువల్ విచారణకు కూడా అల్లు అర్జున్ హాజరు కాలేదు. ఆయన తరపు లాయర్ పిటిషన్ వేయగా మెమో దాకులు చేయాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణ జూలై 6 కు వాయిదా వేసింది. అప్పుడు కూడా వర్చువల్ గా హాజరవుతారని అల్లు అర్జున్ లాయర్ కోర్టుకు తెలిపారు.










